తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపుకై తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం గ్రీన్ఛాలెంజ్ .ఈ కార్యక్రమం ఇప్పుడు దేశం దాటి ఖండాంతరాలకు విస్తరిస్తోంది. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను ఆస్ట్రేలియా డిప్యూటీ స్పీకర్ జాసన్ వుడ్ స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్వీకరించిన ఆస్ట్రేలియా డిప్యూటీ స్పీకర్.. ఈ కార్యక్రమాన్ని వీడియో సందేశం ద్వారా తెలంగాణ సమాజానికి అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మూడన్నర కోట్ల మొక్కలు నాటినట్లు వారు ఆయనకు వివరించారు. దీంతో ఎైక్జెట్కు గురైన ఆయన ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్కుమార్ను ఈ సందర్భంగా అభినందించారు. నాగేందర్ రెడ్డికి స్వయంగా మొక్కను అందించిన జేసన్వుడ్ ఇటువంటి సామాజిక స్పృహ ఉన్న కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
#GreenIndiaChallenge goes international!! It’s an honour that @jasonWood_MP Australia recognised this initiative and supported us. @KNRTRSAUSTRALIA#INDIA ?? #Australia ?? #Telangana #Hyderabad #HaraHaiTohBharaHai ?? pic.twitter.com/Q3DAxq7qXa
— Santosh Kumar J (@MPsantoshtrs) November 10, 2019