తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలో విషాదం నెలకొన్నది. కాసేపట్లో పెళ్ళి కాబోతుండగా పెళ్ళి కుమారుడు సందీప్ ఉరి వేసుకుని ఆత్మహాత్యకు పాల్పడ్డాడు.
ఈ సంఘటన ఇరువురు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడా..?. లేదా ఏదైన కారణం ఉందా అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.