తాను నటించిన మొదటి చిత్రం ప్రేమమ్ నుంచే వయసుకు మించిన పరిణితితో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రతిభను చాటుకుంటున్నా సొగసరి సాయి పల్లవి.మొదటి నుంచి ఎంతో మెచ్యూర్డ్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించడం ఛాలెంజింగ్గా ఉంటుందంటుంది ఈ నేచూరల్ బ్యూటీ.
ఆమె మాట్లాడుతూ చదువుకునే వయసులోనే ప్రేమమ్లో లెక్చరర్గా నటించాను. దియా చిత్రంలో అమ్మగా నటించాను. ప్రతి సినిమాలో నా నిజమైన వయసు కంటే పెద్ద పాత్రల్లోనే నటించాను. కథ, నా పాత్రల్లో ఎంతవరకు కొత్తదనం ఉంది. వాటికి నేను న్యాయం చేయగలనా లేదా అనే విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తాను.
అంతే కానీ ఆ పాత్ర నా వయసు మించినదా లేదా అని ఎప్పుడూ ఆలోచించను. వయసును అవరోధంగా ఎప్పుడూ భావించను. అలాంటి పాత్రల్లోనే నటనను ప్రదర్శించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందని నా నమ్మకం అని తెలిపింది.