టీడీపీ అధినేత చంద్రబాబుకు సమయం, సందర్భం లేకుండా హైదరాబాద్ను నేనే కట్టా..సింధూకు బాడ్మింటన్ నేనే నేర్పించా..సత్యనాదెళ్లకు నేనే గైడెన్స్ ఇచ్చా..కంప్యూటర్ను నేనే కనిపెట్టా..సెల్ఫోన్ను నేనే కనిపెట్టా..ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకోవడం అలవాటు. తాజాగా హైదరాబాద్ గురించి తనదైన స్టైల్లో బిల్డప్ ఇచ్చుకుంటూ….మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నా విజన్ – 2020 డాక్యుమెంట్ను కాపీ కొట్టారంటూ…వింత వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మీరు ఒక్కసారి చూస్తే..నాకోసరం కట్టలే..ఒక ఎయిర్పోర్ట్..ఒక ఔటర్ రింగ్రోడ్డు, ఒక సైబరాబాద్, ఒక మెట్రో, ఒక నాలెడ్డ్ ఎకానమి, హెచ్ఆర్ ఇవన్నీ చేశా..16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చా..విజన్ – 2020 ఫస్ట్ టైమ్ నేను తయారు చేశా..తర్వాత అబ్దుల్ కలాం గారు నాదగ్గరకు వచ్చి..మీరు తయారు చేశారు..ఎట్ల తయారు చేశారు అని ఆ కాపీ తీసుకుని ఆయన దేశానికి విజన్ తయారు చేశారు..ఆ బుక్లు తర్వాత వచ్చాయి..అని గొప్పలు చెప్పుకున్నాడు. ప్రపంచానికే మార్గదర్శగా నిలిచిన అబ్దుల్ కలాం తన దగ్గరకు వచ్చి విజన్ – 2020 కాపీ కొట్టాడంటూ మన అపరమేధావి బాబుగారు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తుఫాను ఎక్కడ తీరం దాటేది నాకు ముందే తెలుసు. హైదరాబాద్ ను నేనే నిర్మించా… నా విజన్-2020 డాక్యుమెంటును అబ్దుల్ కలామ్ కాపీ కొట్టారు… పాపం సూడోలాజియా ఫెంటాస్టికా (pseudologia fantas´tica) అనే మానసిక రుగ్మత వల్లే బాబుగారు ఇలా అయిపోయారు .. తర్కానికందని కోతలు కోయడం దీని లక్షణమే అంటూ చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇక హైదరాబాద్ను నేనే కట్టా, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు నేనే కట్టా అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అడ్డుకోవడానికి అనేక మందితో కేసులు వేయించి భూసేకరణను అడ్డుకున్నాడు. కోర్టులతో పోరాడి 90 శాతం ఔటర్ రింగ్ రోడ్డును స్వర్గీయ వైఎస్సార్ పూర్తి చేస్తే.. 430 ఏళ్ల హైదరాబాద్ తో పాటు ORR ను తనే నిర్మించానని ఇప్పుడు చంద్రబాబు కోతలు కోస్తున్నాడంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ట్వీట్లపై నెట్జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు..అవును..అది నేనే..అది నేనే అంటూ..చంద్రబాబుపై సెటైరికల్ వీడియోలతో నెట్జన్లు విరుచుకుపడుతున్నారు. మొత్తంగా హైదరాబాద్పై చంద్రబాబు బిల్డప్పుకు బాటా చెప్పు తెగేలా విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి.
తుఫాను ఎక్కడ తీరం దాటేది నాకు ముందే తెలుసు. హైదరాబాద్ ను నేనే నిర్మించా. నా విజన్-2020 డాక్యుమెంటును అబ్దుల్ కలామ్ కాపీ కొట్టారు. సూడోలాజియా ఫెంటాస్టికా (pseudologia fantas´tica) అనే మానసిక రుగ్మత వల్లే ఇలా అయిపోయారు పాపం. తర్కానికందని కోతలు కోయడం దీని లక్షణమే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 11, 2019
దేశంలో అందరికీ సలహాలు ఇచ్చిన అత్యంత మేధావి.!! ?
ఇలాంటి మేధావి గుజరాత్ లో పుట్టి ఉంటే బాగుండేదని బాధ పడ్డ మోడీజీ..!! ? pic.twitter.com/iCtu6n0Qxs
— YSJ_?_2024 (@tvsreddy5) November 11, 2019