తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా సర్కారు ఉద్యోగులకు పీఆర్సీ అమలు దిశగా చర్యలు చేపట్టింది.
10,12రోజుల్లో పీఆర్సీ అమలు గురించి నివేదికను ఇవ్వాల్సిందిగా వేతన సవరన సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఉద్యోగుల వేతనాల పెంపుకోసం 2018లో పీఆర్సీ కమిషన్ నియమించింది.
త్వరలోనే పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. 2018 జులై 1 తారీఖు నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఏడాదిన్నరగా వేతనాల పెంపుపై కమిషన్ అధ్యయనం చేస్తుంది.