తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీనిపై తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని గురించి కూడా కోర్టు చర్చలు జరపమని ఒకసారి .. కమిటీ వేస్తామని మరోకసారి ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తూ వస్తుంది.
ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మెపై సుప్రీం మాజీ జడ్జీలతో కూడిన హైపవర్ కమిటీని వేస్తామని హైకోర్టు ఒక ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఒప్పుకోలేదు.
ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్కే జోషి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. లేబర్ కోర్టు పరిధిలో ఉన్నందున ముగ్గురుతో కూడిన కమిటీ అవసరం లేదని .. చట్టం ప్రకారమే లేబర్ కమిషన్ కు ఇవ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే మరోవైపు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తే సమ్మెపై పునరాలోచన చేస్తామని ఆర్టీసీ జేఏసీ చెప్పుకువస్తుంది.