శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీ అనే ప్రముఖ ఆసుపత్రిలో సోమవారం ప్రముఖ దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ చేరిన సంగతి విదితమే. సోమవారం నుంచి వైద్యులు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తూ వస్తోన్నారు.
అప్పటి నుంచి లతా మంగేష్కర్ ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యులు”గత కొంతకాలంగా లతా మంగేష్కర్ శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
లతాజీ ఆరోగ్యం విషమంగానే ఉన్న కానీ కోలుకుంటూన్నారు. ఇంకా ఐసీయూలోనే వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నాము. కొన్ని రోజులు గడవంది లతా ఆరోగ్యం గురించి ఇప్పుడేమి చెప్పలేము అని “అన్నారు.