తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు మల్లన్నసాగర్. మల్లన్నసాగర్ కు త్వరలోనే కాళేశ్వరం జలాలు తరలిరానున్నాయి.
డిసెంబర్ నెల చివరి నాటికి మల్లన్నసాగర్ కు నీటిని తీసుకురావాలి అనే లక్ష్యం దిశగా సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతున్నాయి.
ఇప్పటికే మిడ్ మానేరు వరకు చేరిన నీళ్లను మరో రెండు పంపు హౌస్ ల ద్వారా లిప్ట్ మోటర్లను నడుపుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు తీసుకురానున్నారు. ఎల్లంపల్లిలో ఉన్న నీళ్లను మిడ్ మానేరుకు తరలిస్తున్నారు.
ఈ రిజర్వాయర్ కు సంబంధించిన మరమ్మతు పనులన్నీ పూర్తవుతున్నాయి. అనంతరం ప్రస్తుతం నీటి నిల్వ పన్నెండు టీఎంసీలకు చేరింది.