ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు.
గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం.. ప్రజల దగ్గరనే ఆ సమస్యలను పరిష్కరించడం కోసం తీసుకున్న నిర్ణయం రచ్చబండ.
వైఎస్సార్ రచ్చబండ కార్యక్రమంతో ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కరించేవారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి తన తండ్రి బాటలోనే నడుస్తూ రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు అని సమాచారం.
ఇందుకు ఏపీలో వచ్చే ఏడాది జనవరి నెల లేదా ఫిబ్రవరి నెలలో రచ్చబండ కార్యక్రమాన్ని జగన్మోహాన్ రెడ్డి ప్రారంభించనున్నారు అని సమాచారం.