మహారాష్ట్రలో బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి. మహా ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు..
నిన్న శుక్రవారం ఎన్సీపీ,కాంగ్రెస్,బీజేపీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించి ఇరవై నాలుగంటలు గడవకముందే ఎన్సీపీ,బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తోన్నారు.
మహారాష్ట్రలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచింది బీజేపీ. గెలవడం ముఖ్యం కాదు అధికారమే ముఖ్యమని భావిస్తోన్న రాజకీయ నాయకులు ఇలా నెటిజన్లు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. తాజాగా బీజేపీకి ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు ఇవ్వడం వెనక ఉన్న అసలు కారణం ఇదేనంటూ “నిజమైన అర్హుడు అజిత్ పవార్.
బీజేపీలో చేరటానికి 100% అర్హుడు అజిత్ పవార్. అతని మీద 35 వేల కోట్ల ఇర్రిగేషన్ స్కాం ఆరోపణ ఉంది అట. అందుకే మద్దతు ఇచ్చాడని” నెటిజన్లు సెటైర్లు వేస్తోన్నారు. ఏది ఏమైన మహారాష్ట్ర రాజకీయాల్లో నేడు చీకటి రోజు అని మరికొంత మంది సెటైర్లు వేస్తోన్నారు.