తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిద్దిపేట. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో సిద్దిపేటను ముందువరుసలో ఉంచుతూ యావత్తు తెలంగాణను సిద్దిపేటవైపు చూసేలా అభివృద్ధి చేస్తోన్నారు. తాజాగా సిద్దిపేట మరో అంశంలో ఖాతినోందింది.
సహాజంగా మనం మన ఇంట్లో కానీ మార్కెట్లో కానీ పాడైపోయిన లేదా కుళ్లిపోయిన కూరగాయలను చెత్తలో వేస్తాం. లేదా బయట ఎక్కడ అయిన పారేస్తాం కదా.. కానీ సిద్దిపేట రైతు బజారులో మాత్రం వాటితో సేంద్రీయ ఎరువులను,కరెంటును తయారు చేస్తోన్నారు.
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. సిద్దిపేట రైతు బజారులో రోజుకు పది క్వింటాళ్ల కూరగాయలు చెత్తలోకి వెళ్తుండటంతో మంత్రి తన్నీరు హారీష్ రావు ఆలోచన మేరకు వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. దాదాపు రూ. ముప్పై లక్షలతో ఏర్పాటు చేసిన సరికొత్త ప్లాంట్ తో దాదాపు వంద యూనిట్ల విద్యుత్, రెండు వేల లీటర్ల సేంద్రీయ ఎరువులను తయారు చేస్తూ వ్యర్థాలను తగ్గిస్తున్నారు.