ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీరియస్ వార్నింగిచ్చారు. ఇక నుండి రాష్ట్రంలో అవినీతికి పాల్పడే అధికారుల పట్ల కఠినంగా వ్యవహారించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తుంది.
ఇందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో ఎవరైన ఉద్యోగులు అవినీతికి పాల్పడితే.. పాల్పడినట్లు రుజువైతే సస్పెండ్ చేసి.. నేరుగా ఇంటికి పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం అవినీతి చేసే అధికారుల సమాచారం ఇవ్వడం కోసం ప్రత్యేకంగా మరో కాల్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. దీనికి 10044 అనే ట్రోల్ ఫ్రీ నెంబరును కూడా కేటాయించింది. ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రారంభించనున్నారు.