తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో పరుగులకు ముహుర్తం ఖరారైంది. అందులో భాగంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రజలకు,ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానున్నది.
కొద్ది రోజుల క్రితమే ఈ రెండు ప్రాంతాల మధ్య మెట్రో రైలు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసింది. ఈ ట్రయల్ రన్ కూడా విజయవంతమయింది. దీంతో మెట్రోకు మరో 40వేల మంది ప్రయాణికులు పెరిగే అవకాశముందని సంబంధిత అధికారులు తెలిపారు.
అయితే రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు,నగరవాసులకు ట్రాఫిక్ సమస్యలు చాలా మేరకు తగ్గుతాయి.