తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వినియోగదారులకు కిలో ఉల్లిని రూ.40కే విక్రయించేందుకు మలక్పేట మార్కెట్లోని ఉల్లి వ్యాపారులు అంగీకరించారు.
మంగళవారం మార్కెటింగ్శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి.. మలక్పేట గంజ్ మార్కెట్లోని ఉల్లి వ్యాపారులతో చర్చించారు. బుధవారం నుంచి మెహిదీపట్నం, సరూర్నగర్ రైతుబజార్లలో రూ.40కు కిలో ఉల్లి అందుబాటులోకి రానున్నాయి.
ఒక వినియోగదారుడికి ఒకకిలో చొప్పు న విక్రయించనున్నారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఇతర రైతుబజార్లలో ఉల్లి విక్రయకేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో.. ఇతర దేశాలకు ఎగుమతులను నిలిపివేసిన కేంద్రం దిగుమతులు చేసుకుంటున్నది.
దిగుమతి చేసుకున్నవాటిలో తెలంగాణకు కూ డాకేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిరంజన్రెడ్డి.. అధికారులకు సూచించారు. హమాలీ, రవాణాచార్జీలు ప్రభుత్వం భరించి వినియోగదారులకు రూ.40 చొప్పున అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. బుధవారం అధికారులు ఉల్లి విక్రయకేంద్రాలను ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు