Home / ANDHRAPRADESH / రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేస్తున్న చంద్రబాబు..!

రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేస్తున్న చంద్రబాబు..!

రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి గ్రాఫిక్స్ ఏ నాని  వ్యాఖ్యానించారు.

బాబు  కమీషన్ల కోసమే మదిలో రాజధాని నిర్మాణం చేపట్టారని విమర్శిలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలతో నిండున్నదన్నారు. బాబు అవినీతి హిమాలయాలంత అని ఘాటుగా విమర్శించారు. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టుకుని రాజధాని పర్యటనకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు.

నాడు మోదీని తిట్టి నేడు ఆయన చెంతకు చేరేందుకు  ఆపసోపాలు పడుతున్నాడు. రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి కాళ్లబేరానికి దిగాడు. గతంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌లు బీజేపీని ఎందుకు విమర్శించరు? అధికారంలో ఉన్నా, లేకున్నా టీడీపీ, జనసేనలు జగన్ ను టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నాయి. ఎంత మంది అడ్డుపడినా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat