టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కామారెడ్డి బాన్సువాడలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి రూ.100కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు.
‘బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. బాన్సువాడలో 2వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నాం. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఓ నిత్య విద్యార్థి. నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా స్పీకర్ పోచారం పనిచేస్తారు. సొంత పనులు చేసినంత శ్రద్ధగా స్పీకర్ పోచారం బాన్సువాడను అభివృద్ధి చేస్తున్నారని’ కేటీఆర్ అన్నారు.బాన్సువాడను మున్సిపల్గా మార్చేందుకు కృషి చేసిన కేటీఆర్కు స్పీకర్ పోచారం ధన్యవాదాలు తెలిపారు. నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. గృహ నిర్మాణానికి పట్టణంలో రూ.5.30లక్షలు, గ్రామాల్లో రూ.5లక్షలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
Legislative Assembly Speaker and Banswada MLA @PSRTRS, Ministers @KTRTRS and Vemula Prashanth Reddy inaugurated Mini Stadium in Banswada today. pic.twitter.com/k8nJdj5TnW
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 30, 2019