ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి పనులు చేస్తూ పోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేరుస్తుంటే మరోవైపు తన మతం గురించి, కులం గురించి దుర్మార్గమైన ప్రచారాలను ప్రతిపక్షాలు చేయడం దారుణం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన మతం మానవత్వం అన్నారు.
తన కులం దయా గుణం అని.. ఇంతకు మించి తానేమీ ఆలోచించనని అన్నారు. 6నెలల్లో హామీలకు కట్టుబడి పరిపాలన చేస్తుంటే, ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు.
ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా, ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకున్న రోగులకు డిశ్చార్జి అయిన తర్వాత నెలకింత అంటూ ఇచ్చే ఈ పథకం.. తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అని అన్నారు