టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతుగా మారడానికి రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది.. ఇటీవల కొన్ని పత్రికలు కూడా ఈ కథనాన్ని రాసాయి. కేబినెట్ మంత్రులు పేర్ని నాని, కొడాలినాని, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయమై మంతనాలు జరిపారని ఒక కధనం వచ్చింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలతో వైసీపీపి మంత్రులు సంప్రదింపులు జరిపారట.. మరో ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్లు ప్రచారంలో ఉన్నా వారితో మంత్రులు ఇంకా మాట్లాడలేదని అంటున్నారు. కాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎవరూ పార్టీకి దూరం కాకుండా ఫోన్ చేసి బుజ్జగిస్తున్నారు..
ముఖ్యంగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఆర్థికంగా కానీ, వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి తెలుసుకుంటున్నారట. అయితే ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి కరణం బలరాం, నిమ్మల రామానాయుడు వీరంతా రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళితే సమయంతో పాటు విపరీతమైన డబ్బు కూడా వృధా అయిపోతుంది అని భావించి ఒక గ్రూపుగా తనను ప్రత్యేకంగా పరిగణించాలని స్పీకర్కు నిర్వహించేందుకు సమాలోచనలు జరుపుతున్నారట. అంటే తాము తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులను కామని ఇంకా అవసరమైతే అసలు టీడీపీ మెజార్టీ సభ్యులు మాదే అని మమ్మల్ని ప్రత్యేకించి చూడాలని స్పీకర్ ని కోరతారట.