Home / ANDHRAPRADESH / కర్నూలు జిల్లాలో చంద్రబాబు ముందే టీడీపీ నేతలు వాగ్వాదం

కర్నూలు జిల్లాలో చంద్రబాబు ముందే టీడీపీ నేతలు వాగ్వాదం

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోమవారం నుంచి మూడురోజులపాటు కర్నూలు చంద్రబాబు పర్యటన సాగిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించి భవిష్యత్‌ వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. తొలిరోజు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. రెండవ రోజు ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నేతలతో విడివిడిగా చర్చించారు. నేడు బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అయితే జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ అధినేత చంద్రబాబు ముందే టీడీపీ నేతలు గొడవ పడ్డారు. కర్నూలులో పాణ్యం నియోజకవర్గ సమీక్షా సమావేశంలో రసాభాస నెలకొంది. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు చోటుచేసుకుంది. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మల్లిఖార్జున రెడ్డి పరస్పరం దూషించుకున్నారు. తన ముందే నేతలు తిట్టుకోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషా చేస్తున్నారా? నా ముందే గొడవపడతారా? అంటూ టీడీపీ తమ్ముళ్లపై ఆయన మండిపడ్డారు. సహచర నేతలు కూడా సర్ధిచెప్పడంతో ఇరువురి గొడవ సద్దుమణిగింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat