Home / ANDHRAPRADESH / పవన్ తాజా పరిస్థితిపై భీమవరంలో గెలిచిన గ్రంధి శ్రీనివాస్ ఏమన్నారంటే.?

పవన్ తాజా పరిస్థితిపై భీమవరంలో గెలిచిన గ్రంధి శ్రీనివాస్ ఏమన్నారంటే.?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాలు ఒక శాడిస్టు, అజ్ఞాని మాటల్లా ఉన్నాయని ఆయన సందర్భానికి ప్రసంగానికి ఏమాత్రం పొంతనలేదని విధంగా ఉన్నాయంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ పై గ్రంది శ్రీనివాస్ విజయం సాదించిన సంగతి తెలిసిందే. పవన్‌కు మానసిక జబ్బు ఉందేమోనని తనకు సందేహం ఉన్నదని తగిన చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. పిచ్చి కల్యాణ్‌ నీకు బుర్ర ఉందా లేదా పిచ్చి పట్టిందా అని ప్రశ్నించారు.

 

 

 

సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిగా పవన్‌ గుర్తించడట. పవన్‌ నీకు అసలు రాజ్యాంగం గురించి తెలుసా.. ఎవరిని అవమానిస్తున్నావో తెలుసా.. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడే ఎన్నికలు జరుగుతున్నాయని రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను దారుణంగా అవమానించడం తగదని దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పు అని పవన్‌ కల్యాణ్‌ను డిమాండ్‌ చేశారు. నీకు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు పవిత్రులు. వైఎస్సార్సీపీలో గెలిచిన వారు అపవిత్రులా అంటూ ప్రశ్నించారు. దిశ ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పవన్‌ కు నిజంగానే మతిస్థిమితం కోల్పోయాడు అని వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat