ఆర్టీసీ ఉద్యోగులను సమ్మె అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకునే క్రమంలో సీఎం కేసీఆర్ వారికి పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చే అంశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ హామీని నెరవేర్చే దిశగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ సిగ్నలిచ్చింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి ఆర్టీసీ కానిస్టేబుళ్లు, ఒకరికి కండక్టర్గా ఉద్యోగాలిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.