Home / ANDHRAPRADESH / చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులకేసు విచారణ ఈనెల 20కు వాయిదా ..!

చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులకేసు విచారణ ఈనెల 20కు వాయిదా ..!

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెల్సిందే. అయితేఏసీబీ కోర్టు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసి తన వాదనలను కూడా వినాలని వినతి కోరారు. అందుకు కోర్టు అభ్యంతరం తెల్పడంతో 2005లో హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొంది ఆ కేసును పెండింగ్ లో పడేలా చేయగలిగారు.
ఈ మధ్యనే స్టేఉత్తర్వులను ఎత్తివేయాలంటూ లక్ష్మీపార్వతి హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేసిన నందమూరి లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని శుక్రవారం నమోదు చేయాల్సివుంది. అయితే తన తరఫున సీనియర్‌ న్యాయవాది హాజరవుతారని, అప్పటి వరకూ కేసు విచారణను వాయిదా వేయాలని కోర్టును లక్ష్మీపార్వతి కోరడం జరిగింది.హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. ఈ కేసు నిరూపించబడితే చంద్రబాబు జైలు జీవితం గడపవలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat