తెలంగాణరాష్ట్రంలో ప్రతి ఇంటికి శుద్ధిచేసిన త్రాగునీటిని మిషన్ భగీరథ ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.దామెర మండలం సింగారాజుపల్లి గ్రామ శివారులో మిషన్ భగీరథ పరకాల సెగెంట్ కార్యాలయంలో సంగెo ,గీసుగొండ మండలాల ప్రజాప్రతినిధులకు,అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
పరకాల,నడికూడా,దామెర ఆత్మకూరు,సంగెo ,గీసుగొండ,శాయంపేట మండలాలలోని 180 హాబిటేషన్లకు సింగరాజుపల్లి సెగ్మెంట్ నుండే శుద్ధ జలాల సరఫరా జరుగుతుందన్నారు.రూ. 280 కోట్ల వ్యయంతో నిర్మాణం చేసిన ఈ ప్రాజెక్టును అధికారులు,గుత్తేదారులు ఏడాదిన్నర కాలంలో పూర్తిచేసినందుకు అభినందించారు.
ఇంకా కొన్ని గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న పైప్ లైన్ల పనులను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.లీకేజీలు కూడా అధికారులు త్వరగా స్పందించి చర్యలు చేపట్టే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు.ప్రజలు శుద్ధమైన జలాలు అందించాలనే కృత నిచ్ఛయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ప్రాముఖ్యతను ప్రజలు తెలిసేలా అధికారులు,ప్రజాప్రతినిధులు ప్రజలు తెలిసేలా వివరించాలన్నారు.ఈ అవగాహన సదస్సులో సంగెo ,గీసుగొండ మండలాల ఎంపిపిలు,జెడ్పిటిసిలు, సర్పంచులు,ఎంపిటిసిలు,అధికారులు తదితరులు.