Home / ANDHRAPRADESH / పవన్ కు జనసేన ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాక్

పవన్ కు జనసేన ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాక్

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన వారిలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే తూర్పు గోదావారి జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు . అయితే తాజాగా ఈ ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు.

ఇందులో భాగంగా రేపు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో జనసేన పార్టీ తరపున రైతు సౌభాగ్త దీక్ష చేపట్టిన సంగతి విదితమే. ఈ సభ గురించి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ” రేపు కాకినాడలో జరగనున్న రైతు సౌభాగ్య దీక్షకు నేను హాజరు కావడం లేదు.

రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో నేను వెళ్లను”అని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఇంగ్లీష్ మీడియానికి తాను మద్ధతు ఇస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని”వ్యాఖ్యానిస్తూ పవన్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat