బుధవారం నాడు వాంఖడే స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో అందరు ఊహించినట్టుగానే భారత్ ఘన విజయం సాధించింది. మూడో టీ20 లో భాగంగా ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్, రాహుల్ విండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లి అయితే సిక్షర్ల మోత మోగించాడు. దాంతో నిర్ణీత 20ఓవర్స్ లో ఏకంగా 240 పరుగులు సాధించారు. అసలు చెప్పాలంటే ఈ పిచ్ చేసింగ్ కు బాగా అనుకులిస్తుంది. కాని భారత్ దెబ్బకు వెస్టిండీస్ చేతులెత్తేశారు. దాంతో సిరీస్ భారత్ వశం అయ్యింది.