టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు.. వికెట్ కీపర్.. సీనియర్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే.
ఇందులో భాగంగానే ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ,టెస్ట్ సిరీస్ లో ధోనీ ఆడలేదు. దీంతో అతను రానున్న ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడతాడా..?. అసలు క్రికెట్ ఆడతాడా అని పలువురు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
దీంతో వెస్టిండీస్ ఆలు రౌండర్ బ్రావో స్పందిస్తూ” రానున్న టీ20 వరల్డ్ కప్ భారత జట్టు తరపున ఎంఎస్ ధోనీ ఆడతాడు “అని తేల్చి చెప్పాడు.ఈవిషయాన్ని తాను బలంగా నమ్ముతున్నాను. ధోనీని ఎవరితోనూ పోల్చవద్దు”అని బ్రావో సూచించాడు.