గ్రేటర్ హైదరాబాద్ లో హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట సెవెంత్ డే చర్చిలో పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను క్రిస్టియన్స్ కు కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్స్ కు క్రిస్మస్ కానుకలను (దుస్తులను ) ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు.
పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందన్నారు. డివిజన్ లో ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా అమలు చేయడం జరుగుతుందన్నారు.క్రిస్మస్ పండుగను క్రిస్టియన్ సోదరులు ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో .. పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ సొసైటీ చైర్మన్ రెవ గొడి శేఖర్, ప్రెసిడెంట్ సి హెచ్ ఎలీషా, వైస్ ప్రెసిడెంట్ డీ బీ విష్పర్తి, సెక్రటరీ ఎన్.ఇశ్రాయేలు, పాస్టర్స్ బి. బాలకృష్ణ, ఎన్ చిట్టిబాబు,ఎన్ కే.పెడ్రిక్, రెవ ఏసుపాదం, జగదిక కుమార్, టిఆర్ఎస్ నాయకులు రామ్ మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.