ప్రస్తుతం ‘దిశ’ చట్టంపై దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశంలోనే ఒక చారిత్రాత్మక చట్టమని, దీన్ని అమలు చేసినందుకు జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్పీకర్ తమ్మినేని. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి చట్టం లేకపోతే మానవ మృగాలు ఎక్కువగా తయారవుతారని అన్నారు. అన్ని రాష్ట్రాల వారు ఈ చట్టం పత్రాల కాపీ ని ఇవ్వమని అడుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శిస్తున్నారు. “దిశ చట్టాన్ని సాక్షాత్తు ప్రధాని ప్రశంసించారు. యాక్టు కాపీని పంపిస్తే తామూ అనుసరిస్తామని ఢిల్లీ, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలు అభ్యర్థించాయి. చట్టం రూపొందించే చర్చలో పాల్గొనకుండా ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శించారు చంద్రబాబు. ఉల్లిపై లొల్లి చేసి దివాళాకోరుతనాన్ని బయట పెట్టుకున్నారు” అని మండిపడ్డారు.