సీఎం జగన్ తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులుగా విభజించాలి అనే నిర్ణయం నిజంగా చాలా మంచి నిర్ణయం అని, ఈ మేరకు పార్టీలను పక్కన పెట్టి ఆయన నిర్ణయాలను ప్రత్యర్ధులు సైతం స్వాగతిస్తుంటే చంద్రబాబు మాత్రం అందరికి వ్యతిరేకంగా ఉన్నారు. అలా ఎందుకు ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే అని చెప్పాలి. మరోపక్క బాబుని పక్కన పెడితే ఆయనకన్నా ఎక్కువగా ఫీల్ అవుతున్నారట ఒక పెద్ద మనిషి. ఆయను ఎవరూ అనేది వైసీపీ అధినేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బయటపెట్టారు.”అమరావతి విషయంలో బాబు కంటే కూడా కిరసనాయిలు తెగ ఫీల్ అయినట్టున్నాడు. పేపర్ నిండా విషపు రాతలు పర్చాడు. రాజధానిని వికేంద్రీకరిస్తే హైదరాబాద్ లాభపడుతుందట. ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? కర్నూలు, విశాఖలు అభివృద్ధి చెందొద్దనేది వీళ్ల ఏడుపు” అని ట్వీట్ చేసారు.
అమరావతి విషయంలో బాబు కంటే కూడా కిరసనాయిలు తెగ ఫీల్ అయినట్టున్నాడు. పేపర్ నిండా విషపు రాతలు పర్చాడు. రాజధానిని వికేంద్రీకరిస్తే హైదరాబాద్ లాభపడుతుందట. ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? కర్నూలు, విశాఖలు అభివృద్ధి చెందొద్దనేది వీళ్ల ఏడుపు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 19, 2019