తెలుగు సినిమా ఇండస్ట్రీ జక్కన్న.. ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి చిన్న తనయుడైన అయిన శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మత్తు వదలరా .
ప్రముఖ దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరవాణి పెద్ద కుమారుడు కాలబైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీకి చెందిన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రశంసలతో పాటు మంచి ఆదరణ లభించింది.
ఈ మూవీ ఈ నెల ఇరవై ఐదో తారీఖున విడుదల చేయాలని చిత్రం యూనిట్ భావిస్తుంది. ఆరోజు ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మానేస్తా అని జక్కన్న ట్వీట్ చేశాడు.ఇది అన్నమాట అసలు సంగతి.