కర్నూలులో జుడిషియల్ హైకోర్టు ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ శవయాత్రను నిర్వహిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, రాయలసీ యువజన సంఘనాయకులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో టిడిపి కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానంటూ హామీలు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. వారికి పవన్ కళ్యాణ్ సైతం మద్దతు తెలియజేశారు. అయితే గత ఐదేళ్లలో ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు చంద్రబాబు.
ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ తో మూడు ప్రాంతాలలో రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా కర్నూలును జుడిషియల్ రాజధానిగా ఎంచుకున్నారు. దీనిని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలు సైతం జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు కానీ చంద్రబాబు పవన్ మాత్రం రాజధాని ఒకే ప్రదేశంలో ఉండాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలులో చంద్రబాబు పవన్ ల శవ యాత్ర అంటూ ఫ్లెక్సీలతో తో తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు, రాయలసీమ యువజన సంఘ నేతలు నిరసనలు తెలియజేస్తున్నారు.