Home / ANDHRAPRADESH / ఇప్పుడు ఏమంటావ్ పవన్ కళ్యాణ్..!

ఇప్పుడు ఏమంటావ్ పవన్ కళ్యాణ్..!

ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు, తన బంధువులకు, తన పార్టీ కార్యకర్తలకు అమరావతి భూములు ముట్టజెప్పి అవినీతికి పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మూడు ప్రాంతాలను రాజధానులుగా నిర్ణయించి సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని అంటూ, రాజధాని విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కు అవగాహనలేదని ప్రజలంతా 3 రాజధానులను  స్వాగతిస్తున్నారన్న విషయం ఆయనకు అర్ధంకావడంలేదని మండిపడ్డారు.

 

 

గత ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ నా మనసుకు కర్నూలు యే రాజధాని అని కర్నూలు ను రాజధాని చేస్తామని ప్రసంగాలు చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలును  జూడిషియల్‌ క్యాపిటల్‌ అంటే ఎందుకు ఒప్పుకోవడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పెంపుడు చిలుకలా పవన్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అడుగుజాడలలో పవన్ మెలుగుతున్నారని ఎద్దేవాచేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat