టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ కోర్ కమిటీ సభ్యులు తెలంగాణ ఆర్ధిక శాక మంత్రి టీఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ ని మరియు ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేష్ ని మర్యాదపూర్వకంగా వారి నివాసములో కలిశారు. ఈ భేటీ సందర్బంగా టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ కన్వీనర్ శ్రీ వెంకట్ రావు తాళ్ళపెల్లి, ఐటీ సెక్రెటరీ శ్రీ జై విష్ణు గుండా, ఎక్ష్జిక్యుటీవ్ మెంబర్ శ్రీ సాయి కిరణ్ నల్లా, కల్చరల్ ఇంచార్జ్ శ్రీ నవదీప్ రెడ్డి గుడిపాటి మరియు చారిటీ ఇంచార్జ్ శ్రీ రేపాల శ్రీనివాస్ లు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు తథ్యం అని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని గత అస్సెంబ్లీ ఎన్నికలనుండి జరిగిన ప్రత్యక్ష ఎన్నికలన్నింటిలో టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ ముందుండి ప్రత్యక్ష ప్రచారములో, టెలిఫోనిక్ క్యాంపైన్, మన ఎమ్మేల్యే మన ఎంపీ మరియు సోషల్ మీడియా క్యాంపైన్ ని పకట్బందీ గా ఎన్నారై కోఆర్డినేటర్ శ్రీ బిగాల మహేష్ మరియు ఎన్నారై శాఖ ల ఇంచార్జ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గైయిడన్స్ తో అమలు పర్చి గత సంవత్సర కాలములో టీఆరెస్ పార్టీ సాధిస్థున్న అద్బుత విజయాలలో తమవంతు పాత్ర ని పోషిస్తున్నామని ఇక మీదట కూడా అలాగే కొనసాగిస్థామని హరీష్ కు టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ కోర్ కమిటీ సభ్యులు వివరించారు.