సీఎం కేసీఆర్ తో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యునైటెడ్ ముస్లిం ఫోరం నాయకులతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. సుమారు 3 గంటలపాటు ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశమనంతరం ఎంపీ అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్ఆర్సీని వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ను కోరాం. సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయొద్దని సీఎంకు లేఖ సమర్పించాం. రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.
సీఎం కేసీఆర్ తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఎంపీ అసదుద్దీన్ చెప్పారు. ఈ నెల 27న నిజామాబాద్లో సభ నిర్వహిస్తామని ఎంపీ అసదుద్దీన్ అన్నారు.