Home / ANDHRAPRADESH / చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్..!

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్..!

ఏపీకి మూడు రాజధానుల అంశం టీడీపీలో చిచ్చురేపుతోంది. కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుపై రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సీఎం జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అమరావతికే జై కొడుతూ..ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో చంద్రబాబు తీరుపై సీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదే విషయంపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ…టీడీపీపై, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానుల అంశంలో తెలుగుదేశం దేశం పార్టీ మూడు ముక్కలైందని, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు మాటలకు… ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘విశాఖపట్నంలో రాజధాని అంటే అక్కడి టీడీపీ నాయకులు స్వాగతిస్తామంటారు. రాయలసీమ టీడీపీ నాయకులు మేము కూడా స్వాగతిస్తామంటారు. అయితే రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతల మాటలకు చంద్రబాబు మాటలకు ఏమాత్రం పొంతన లేదు… బాబు తన రెండు కళ్ళ సిద్ధాంతం మానుకోవాలని విష్ణు మండిపడ్డారు.

గత ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడమైనా నిర్మించారా అని చంద్రబాబును విష్ణు నిలదీశారు. రాజధాని పేరుతో టీడీపీ నాయకులు దాదాపు నాలుగు వేల ఎకరాల మేర ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడీపీ నాయకుల బినామీ బాగోతాల గురించి అసెంబ్లీలో వివరించారన్నారు. అయితే ఇప్పుడు ఉద్యమాల పేరుతో మరో సారి చంద్రబాబు రాజధాని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు రైతులను మోసం చేసి.. మళ్లీ రైతులు చేసే ఆందోళన వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని ప్రశ్నించారు. చంద్రబాబు కుయుక్తులు, కుట్రలు సాగనివ్వమని… రాజధాని రైతులకు వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మొత్తంగా మూడు రాజధానుల వ్యవహారంలో చంద్రబాబు తీరుపై టీడీపీ ఉత్తరాంధ్ర, సీమ నేతలతోపాటు, వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat