Home / ANDHRAPRADESH / బస్సు ప్రమాదంపై సీఎం స్పందన భేష్..!

బస్సు ప్రమాదంపై సీఎం స్పందన భేష్..!

అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్‌ జలపాతం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. కదిరి హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు రెండు రోజుల క్రితం ఉత్తర కర్ణాటకు విహారయాత్రకు వెళ్లారు. కాగా దార్వాడ్ వద్ద వారి బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులు బయటకు వచ్చారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబామక్సుద్దీన్ అనే విద్యార్థి మృత చెందాడు.

 

 

బస్సు ప్రమాద తీవ్రతతో పాఠశాల హెడ్మాస్టర్‌ గుండెపోటు రావడంతో ఆయనను కూడా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పరిస్థితిపై ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ స్కూల్‌బస్సుకు ప్రమాదంపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరా తీసారు.. ఆయనకు సీఎంఓ అధికారులు వివరాలు తెలిపారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు అందించాలని సీఎం ఆదేశించారు. గాయపడ్డవారికి చికిత్స అందించేలా చూడాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి తగిన ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat