ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చాడు. రాజదాని విషయంపై నిర్ణయం తీసుకోవడానికి జగన్ ఎవరు ? బోస్టన్ గ్రూపు ఎవరూ అని చంద్రబాబు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఘాటుగా స్పందించిన బొత్స పదేళ్లపాటు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు అది వదిలి రావడానికి ఎవరు అధికారమిచ్చరో ఆ ప్రజలే జగన్ కి అధికారం ఇచ్చారని చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు అని అన్నారు. బీసీజీ గ్రూప్ వరల్డ్ లో మూడో స్థానంలో ఉందని, దానితో మీరు పని చేసి కూడా ఇప్పుడు దానిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మీరు ఎలాగు చేసింది లేదు చేసేవారిని కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఘీంకారాలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన గట్టిగా చెప్పారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొనే జగన్ ముందుకు వెళ్లి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.