Home / ANDHRAPRADESH / మూడు రాజధానులపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. భగ్గమంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు,,!

మూడు రాజధానులపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. భగ్గమంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు,,!

వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే..మళ్లీ రాజధాని అమరావతే అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన సోమిరెడ్డి ఒక వేళ రాజధానిని ఇప్పుడు అమరాతి నుండి మార్చినా..వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాల అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు వాదిస్తున్నట్లుగానే రాజధాని తరలింపు సాధ్యం కాదని..అది ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతమని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.శాసనసభలో ప్రతిపక్షనేతగా అమరావతిని స్వాగతించిన జగన్ ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటన చేయడం సరికాదని, అసలు రాజధానిని తరలించాలంటే తాతలు దిగిరావాలని సోమిరెడ్డి తనదైన స్టైల్లో రంకెలు వేశారు. అయితే మూడు రాజధానులను స్వాగతించిన ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు సోమిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం చెబుతున్నారు. టీడీపీ వచ్చేసారి అధికారంలోకి వస్తే..మళ్లీ అమరావతికి రాజధానులు తరలిపోతాయనే భావన ఉత్తరాంధ్ర, సీమ ప్రజల్లో నెలకొంటే అది తమ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదమని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే సోమిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఇంకా స్పందించలేదు..కాగా టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని..సోమిరెడ్డి చెప్పడం వెనుక చంద్రబాబు ఉన్నాడని…సీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే జరిగితే..కేవలం రెండు, మూడు జిల్లాలలో తప్పా..మిగతా ప్రాంతాలలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆ పార్టీ నేతలు అంటేన్నారు. మొత్తంగా మూడు రాజధానులపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat