Home / ANDHRAPRADESH / వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు..!

వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు..!

రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలవైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని…భక్తుల  విశ్వాసం..వైకుంఠద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ముల్లోకాలలో ఉన్న పుణ్య నదులన్నీ స్వామివారి పుష్కరిణిలో కలుస్తాయని వరాహ పురాణం చెబుతోంది. ఆరోజు పుష్కరిణిలో స్నానమాచరిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 12టన్నుల పుష్పాలతో ఆలయం, అనుబంధ ఆలయాలను పరిమళభరిత పుష్పతోరణాలు, పలు రకాల పండ్ల తోరణాలతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీపాలంకరణలతో కొండ ప్రకాశిస్తోంది. ప్రధాన రహదారులన్నీ విద్యుత్‌ వెలుగులతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నాయి. వైకుంఠ ద్వారాలతో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గోవిందమాల భక్తులు ఇరుముడులను చెల్లించేందుకు ఆలయం వెలుపల హుండీలను ఏర్పాటు చేశారు. వాహన మండపంలో శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2500 మంది సిబ్బందితో బందోబస్తుకు నియమించారు.మరో 200మంది స్పెషల్‌ పార్టీ పోలీసులతో ప్రముఖులకు బందోబస్తును కల్పిస్తున్నారు. ఘాట్‌ రోడ్లలో నిరంతరాయంగా కూంబింగ్‌ నిర్వహించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దొంగతనాలను ఆరికట్టడానికి ప్రత్యేకంగా స్పెషల్‌ క్రైం టీంలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. కాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు, టైమ్‌స్లాట్, దివ్యదర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ద్వాదశి నాడు మాత్రం 2,500 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో భక్తులకు కేటాయించింది. ఈ రెండు రోజుల్లో కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. పూజాది కార్యక్రమాలు, నైవేద్యం, విశ్రాంతి, ప్రముఖుల దర్శనాలను మినహాయిస్తే దాదాపు 43గంటల పాటు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు లక్షా 90వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. లక్ష మంది భక్తులు వేచివుండేలా షెడ్లు నిర్మిస్తున్నారు. మొత్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat