ఇండియన్ మిసైల్ మ్యాన్,పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం పై బయోపిక్ రానున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాంపై బయోపిక్ ను తమ సంస్థలో నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారంగా ప్రకటించింది.
రామబ్రహ్మం సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ బయోపిక్ లో అబ్దుల్ కలాం జీవితళొ ఏమి ఏమి జరిగింది అనే పలు అంశాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కనున్నది.
కలాం పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు పరేష్ రావల్ నటించనున్నారు. ఈ విషయం గురించి పరేష్ రావల్ తన ఆనందాన్ని పంచుకుంటూ కలాం పాత్రలో నటించడం నా అదృష్టం అని ట్వీట్ చేశారు. ఈ మూవీ తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలలో రూపొందనున్నది.