టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటులు విజయశాంతి, రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,సంగీత ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ నెల పదకొండు తారీఖున ప్రపంచం వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ సరిలేరు నీకెవ్వరు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కానుకగా సినీ థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో అన్ని థియేటర్లలో స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
అందులో భాగంగా ఈ నెల పదకొండో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు రెండు షోలు అదనంగా వేసుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
తమ మూవీ స్పెషల్ షోలకు అనుమతివ్వాలని నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర వైసీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకుంది.