మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?. నెలలో ఎక్కువ రోజులు రైలులోనే ప్రయాణం చేయంది మీకు రోజు గడవదా..?. అయితే ఇది మీలాంటి వాళ్లకోసమే.రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుభవార్తను అందించారు.
రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఇకపై రిజర్వేషన్ అవసరం లేదు. ఆన్ లైన్ ,ఐఆర్సీటీసీ యాప్లో రిజర్వ్ చార్ట్ అందుబాటులోకి రానున్నది. దీంతో ప్రయాణికులు ఎన్ని సీట్లు రిజర్వ్ అయ్యాయనే సంగతి తెలుస్తుంది.
అంతేకాకుండా ఇంకా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే సంగతి కూడా తెలుస్తుంది అని సదరు మంత్రి పేర్కొన్నారు. తొలి చార్ట్ రైలు బయలుదేరేముందు నాలుగంటలకు ముందు.. రెండో చార్ట్ అరగంట ముందు ఆన్ లైన్లో కన్పించనున్నది.