Home / MOVIES / సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ సీనులో దుమ్ము దులిపిన మహేష్

సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ సీనులో దుమ్ము దులిపిన మహేష్

టాలీవుడ్ యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు.

ఈ మూవీ శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ బెనిఫిట్ షో దగ్గర నుండి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని కురిపిస్తుంది. అయితే ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ అదుర్స్ అని ఇటు సినీ విశ్లేషకులు,మహేష్ అభిమానులు అంటున్నారు. కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర వచ్చే సీన్ న భూతో నభవిష్యత్ అని అంటున్నారు.

ఈ సీనులో విజయశాంతిని ఆ బురుజు దగ్గర కూర్చోబెట్టి అందరి సాక్షిగా చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడే అక్కడకి ఎంట్రీచ్చిన సూపర్ స్టార్ మహేష్ “ఇంట్లో చెప్పే వచ్చావ నాతో జాగ్రత్త అని విలన్ అజయ్ నువ్వేవ్వడ్రా అని అడిగిన ప్రశ్నకు ఇచ్చే సమాధానం దగ్గర నుండి ఎండింగ్ వరకు చెప్పే ప్రతి డైలాగ్ అద్భుతంగా ఉంది. ఈ సీను తర్వాత హాఫ్ పైన ఆసక్తి పెరిగేలా చేస్తుంది. ఈ మూవీ మొత్తంలో ఈ సీను ఒకటి ఆదర్స్ అని అంటున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు.. ఇప్పుడే మీరు కూడా బుక్ చేసుకోండి మరి..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat