ఏపీ అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పంచులతో విరుచుకుపడ్డారు. ఏపీకి మూడు రాజధానులపై బాబు అండ్ బ్యాచ్ పలు నిరసనలు.. ధర్నాలు చేస్తున్న సంగతి విదితమే.
అయితే దీనిపై ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ” గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో రాజధానికి లక్షకోట్లు కావాలి అని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు రెండు వేల కోట్లు మాత్రమే చాలు అంటున్నారు. ఇందులో తొంబై ఎనిమిది వేల కోట్లను మింగేయాలని కుట్రలు పన్నారా..?. గోదావరి పుష్కరాలలో పిచ్చి పబ్లిసిటీ కోసం ముప్పై మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న చంద్ర్తబాబు..
రాజధాని కోసం అన్యాయంగా రైతుల దగ్గర భూములను లాక్కున్న చంద్రబాబు నాడు ఎందుకు ధర్నాలు పోరటాలు చేయలేదని విమర్శించారు. అఖరికి తన కొడుకు పప్పును అడ్దుపెట్టుకుని దోచుకోవాలని రాజధాని దగ్గర ప్రాంతంలో ఎన్నికల బరిలోకి లోకేశ్ ను దింపితే ప్రజలు తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టి అబ్బ కొడుక్కి బుద్ధి చెప్పారని అన్నారు. ఇప్పటికైన తన పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు తన్ని తరిమి ఇంట్లో కూర్చోబెడతారు అని ఆమె అన్నారు.