Home / ANDHRAPRADESH / కిరసనాయిలుకు ఏపీ రాష్ట్రంగా కనిపించడం లేదా..!

కిరసనాయిలుకు ఏపీ రాష్ట్రంగా కనిపించడం లేదా..!

ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందడగు వేస్తుంటే చంద్రబాబుతోపాటు ఆయన అనుకుల మీడియాధిపతి రగలిపోతున్నారు..ప్రతి ఆదివారం ఎడిటోరియల్ పేరుతో తన పత్రికలో నిస్సిగ్గుగా పచ్చ పలుకులు పలికే సదరు మీడియాధిపతి..గత ఆదివారం కూడా సీఎం జగన్‌పై అక్కసు వెళ్లగక్కాడు..తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఏపీ సీఎం జగన్ నడుచుకుంటున్నారని… అసలు ఏపీలో పాలనలేదు..ప్రభుత్వమే లేదంటూ పుల్లవిరుపు మాటలు మాట్లాడాడు. జరుగుతున్నది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై కోపంతోనా, ఒక సామాజికవర్గంపై ఆగ్రహంతోనా అన్నది వేరే విషయం. జరగబోయేది ఏమిటో కళ్లెదుట కనిపిస్తోందంటూ ..మూడు రాజధానులు ఏర్పాటు అయితే ఏదో విధ్వంసం జరుగుబోతుందన్నంతగా రాసుకొచ్చాడు.

 

అయితే తాజాగా పొద్దస్తమానం చంద్రబాబుకు భజన చేస్తూ..జగన్ సర్కార్‌పై చెత్తపలుకులు పలికే సదరు పచ్చమీడియాధిపతిపై, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. బాస్’ పదవి పోయినప్పటి నుంచి కిరసనాయిలుకు ఏపీ అనేది ఒక రాష్ట్రంగా కనిపించడం లేదని విమర్శించారు. వందల కోట్ల రూపాయలను దోచుకునే అవకాశం కోల్పోవడంతో 5 కోట్ల మంది ప్రజలపై ద్వేషాన్ని పెంచుకున్నారని మండిపడ్డారు. పచ్చకళ్లతో మూసుకుపోయి రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, పాలన లేదన్నట్టు చెత్త పలుకులు పలుకుతున్నారంటూ…సదరు ఎల్లోమీడియాధిపతిపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు..మొత్తంగా చంద్రబాబుకు వంత పాడుతూ జగన్‌పై పదే పదే విషం చిమ్మే పచ్చ మీడియాధిపతికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat