టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా … సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,సంగీత,రావు రమేష్ తదితరులు నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు.
ఇటీవల సంక్ర్తాంతి పండుగ కానుకగా పదకొండు తారీఖున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే కలెక్షన్ల సునామీని కురిపించిన ఈ మూవీ పదిరోజుల్లోనే రూ.200కోట్లను గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఇక షేర్ కలెక్షన్ల విషయానికి వస్తే మొత్తం రూ.124.42కోట్లు. స్టార్ నిర్మాత దిల్ రాజ్ సమర్పణలో జీఎంబీ ఎంటర్ ట్రైన్మెంట్స్ ,ఏకే ఎంటర్ ట్రైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.