టీమిండియాతో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ బారత బౌలర్లను ఉతికిఆరేసి ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 203పరుగులను సాధించింది.
ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ఆటగాళ్ళు భారత బౌలర్లపై రెచ్చిపోయారు. ఓపెనర్లు మున్రో (59),గఫ్తిల్(30)రాణించారు.
కెప్టెన్ విలియమ్సన్ 26 బంతుల్లో నాలుగు ఫోర్లు,నాలుగు సిక్సులతో యాబై ఒక్క పరుగులు చేశాడు. చివర్లో టేలర్(54*)భారత బౌలర్లను దుమ్ము దులిపాడు. మరోవైపు టీమిండియా బౌలర్లలో బుమ్రా,శార్దూల్,జడేజా,చాహల్ ,దూబేలకు తలో వికెట్ దక్కింది.