తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఆధ్వర్యంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ మదు రాజేందర్ శర్మ, సెస్స్ డైరెక్టర్ రామతీర్థపు రాజు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వేములవాడ మున్సిపాలిటీలో సుపరిపాలనకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. వీటీడీఏతో కలిసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే చెన్నమనేనితో కలిసి స్వయంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తాము. వేముల వాడ ఆలయ మరియు పట్టణాభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుంది అని అన్నారు.