Home / ANDHRAPRADESH / లోకేషూ.. మతి ఉండే మాట్లాడుతున్నావా.. ఆ చెత్త ట్వీట్లేంటీ..నువ్వు మారవా…!

లోకేషూ.. మతి ఉండే మాట్లాడుతున్నావా.. ఆ చెత్త ట్వీట్లేంటీ..నువ్వు మారవా…!

దొంగే దొంగా దొంగా అరిచినట్లు..తాము చేసే తప్పులన్నీ చేసేస్తూ..ఎదుటోళ్ల మీద నెట్టేసి బురదడజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…గతంలో ఎన్టీయే గవర్నమెంట్‌లో ఉంటూ..తమ పార్టీ ఎంపీలను కేంద్రమంత్రులుగా చేసుకుని కూడా..అదిగో కేసీఆర్, మోదీ, జగన్‌లు ఒకటై టీడీపీపై కుట్ర చేస్తున్నారంటూ బురద జల్లారు..ఏమైంది ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు..అయినా తండ్రీ కొడుకులు ఏం మారలేదు..ఇప్పుడు లోకేష్ కూడా తన బాబును మించిపోయి జగన్‌‌పై బురద జల్లడం మొదలెట్టాడు.

 

రోజు ట్విట్టర్‌లో కూతెట్టి జగన్‌‌ను తిట్టే లోకేష్ తాజాగా చేసిన ట్వీట్లు తెలుగు తమ్ముళ్లనే షాక్‌కు గురి చేశాయి. ఇంతకీ లోకేష్ ఏం ట్వీట్లు చేశాడంటే…విశాఖని, ఉత్తరాంధ్రని దెబ్బతీసింది జగన్ గారే. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు. తల్లిని ఓడించారనే ద్వేషంతో ఉత్తరాంద్ర నడ్డివిరిచేలా జీఎన్ రావు కమిటీతో విశాఖపై విషంకక్కారు. తుఫాన్లు వస్తాయని, ఉప్పునీరు చొచ్చుకొస్తుందని,రక్షణ ఉండదని కుట్రపూరితంగా రిపోర్ట్ రాయించారు. ఆ చెత్త రిపోర్ట్ వలన ఎవరూ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకుండా చేసారు. ఉత్తరాంధ్రకి కంపెనీలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, యువతకి ఉద్యోగాలు రాకుండా చేసి జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ తో వైయస్ జగన్‌ గారు దారుణంగా దెబ్బతీశారు. ఉత్తరాంధ్రపై వైయస్ జగన్ గారి దండయాత్ర ప్రారంభమైంది. అభివృద్ధి ప్రణాళిక లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి అని జగన్ గారు అన్నప్పుడే అనుమానం వచ్చింది. కార్యాలయాలు అటు, ఇటు మార్చడం ద్వారా ఉత్తరాంధ్ర వెలిగిపోతోందని అన్నప్పుడు నా అనుమానం మరింత బలపడింది. విశాఖలో జరుగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా వీరంగం, ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు చూస్తుంటే క్లారిటీ వచ్చిందంటూ లోకేష్ వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. దీంతో మా చినబాబు జగన్‌పై చిందులేసాడన్న లెవెల్లో బాకామీడియా వూగిపోయింది.

 

అసలు విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు వైయస్ జగన్ వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెడితే అడ్డుకున్నది చంద్రబాబు, లోకేష్‌లే… విశాఖ, కర్నూలులో రాజధానులు వద్దు అంటూ గత 50 రోజులుగా అమరావతి రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయింస్తుంది చంద్రబాబు, లోకేష్‌లే..ఆఖరకు అమరావతి ఉద్యమం కోసం జోలెపట్టి ఊరూరా తిరుగుతూ అడుక్కున్నది ఈ తండ్రీ కొడుకులే..ఇప్పుడు పార్లమెంట్ ముందుకు శాసనమండలి బిల్లును రానివ్వకుండా ఢిల్లీ వేదికగా చక్రం తిప్పుతుంది చంద్రబాబు లోకేషులే…ఇక ఏ జీఎన్‌రావు కమిటీని భోగిమంటల్లో తగలెట్టారో..ఆ జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇప్పుడు బాబు, లోకేష్‌లకు భగవద్గీతలా మారింది. విశాఖకు తరచుగా తుఫానులు, వరదలు, సముద్ర మట్టం పెరగడం వంటి ముప్పు ఉంటుందని.. విశాఖ రాజధానిగా పనికిరాదని, జీఎన్‌రావు కూడా విశాఖలో రాజధాని పెట్టమని చెప్పలేదని…ఇలా రకరకాలుగా అనుకులమీడియాలో విషప్రచారం చేయిస్తుంది చంద్రబాబు లోకేషులే.. కాగా శాసనమండలి రద్దును అడ్డుకున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ…ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రతి రోజు చంద్రబాబు దిష్టిబొమ్మలు తగలేస్తూ…అక్కడి ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం విశాఖని,ఉత్తరాంధ్రని దెబ్బతీసింది జగన్ గారే. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారంటూ ఎదురుదాడి చేస్తూ బురదజల్లుతున్నాడు.

 

ఎప్పటిలాగే ట్విట్టర్‌లో కూతెట్టె లోకేష్ బాబు ఎమ్మెల్సీ పదవి వూడిపోతుండే సరికి ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదో , ప్రజలు అమాయకులు ఏం చెప్పినా నమ్ముతారనే ఓవర్ కాన్షిడెన్స్ వల్ల ఏమో కానీ…జగన్‌ను తిట్టడానికి ట్వీట్లు చేసి నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రతి రోజు విశాఖపై విషం కక్కుతూ..పైగా జగన్‌పై బురద జల్లుతున్నావు.. నీకు సిగ్గనిపించడం లేదా…విశాఖలో రాజధాని పెట్టి డెవలప్ చేయడానికి సీఎం జగన్ వికేంద్రీకరణ బిల్లు పెడితే అడ్డుకున్నది నువ్వు, నీ బాబు…విభజన సమయంలో రాజధాని విశాఖలో పెట్టకుండా… ఏమిలేని అమరావతిలో పెట్టి..ఉత్తరాంధ్రకు ద్రోహం చేసింది నువ్వు..నీ బాబు..మీ కుల మీడియాలో విశాఖపై విషప్రచారం చేయిస్తుంది..నువ్వు నీ బాబు…అయినా రాజధాని వస్తే ఉత్తరాంధ్ర క్రమంగా డెవలప్ కాదా…ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావా..అసలు ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరో ప్రజలందరికీ తెలుసు కానీ ఇలా చెత్త ట్వీట్లు చేసి పరువు పోగొట్టుకోకు లోకేష్.అంటూ నెట్‌జన్లు ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. మొత్తానికి సీఎం జగన్‌పై బురద జల్లబోయి అడ్డంగా బుక్కైపోయాడు లోకేషూ..పాపం చినబాబు ఎప్పుడు ఎదుగుతాడో ఏంటో..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat