ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో కలవరపడుతున్న చైనాకు మరో అతి భయంకరమైన వైరస్ సోకిందని సమాచారం. ఇప్పటికే కరోనా వైరస తో వందల మంది మృత్యువాత పడుతున్నారు.
హునన్ ఫ్రావిన్స్ లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశపు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. షయోయంగ్ నగరం శివారులో ఓ కోళ్లఫారంలో ఈ వరస్ ధాటికి మొత్తం 4500కోళ్లు మృతి చెందినట్లు వెల్లడించారు.
అయితే ఇది వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సదరు మంత్రి తెలిపారు.